February 15, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

అజయ్ ను చట్టపరంగా శిక్షిస్తాం.. జగన్ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన మల్లీశ్వరి

ఏపీ రాజకీయాల్లో తెనాలి మహిళ గీతాంజలి మరణం వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి, సోషల్ మీడియా వార్‌కు ఆఘటన కారణయమైంది. టీడీపీ , జనసేన ట్రోలింగ్ కారణంగానే మానసిక వేదనతో గీతాంజలి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపించారు. అప్పటి వైసీపీ మంత్రులు గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ కేసులో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి అజయ్ సజ్జాను గతంలో పోలీసులు అరెస్టు చేసారు. అజయ్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయటం వల్లే గీతాంజలి మృతి చెందిందని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. అనంతరం అజయ్ బెయిల్ పై విడుదలయ్యారు.. ఇదంతా గతం..

అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చిందంటే.. వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లీశ్వరి ఇటీవల ఓ టీవీ చానల్ డిబేట్ లో మాట్లాడుతున్నారు.. అదే డిబేట్ లో టీడీపీ తరపున పాల్గొన్న అజయ్ సజ్జా సబ్జెక్ట్ మాట్లాడకుండా జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే అనే పదం ఉపయోగించారు. వెంటనే కోపం చిర్రెత్తుకురావడంతో మల్లీశ్వరి రెచ్చిపోయారు. దమ్ము ధైర్యం లాంటి పదాలు ఉపయోగించవద్దని ఇప్పటికే లక్షసార్లు చెప్పానని అయినా నువ్వు మారడం లేదన్నారు. ఇలా విసిగించే గీతాంజలి మరణానికి కారణమయ్యావని, 2029లో వైసీపీ ప్రభుత్వం రాగానే కచ్చితంగా ఇందుకు మూల్యం చెల్లించుకుంటావని, చట్టపరంగా ఆ కేసుపై మరింత దర్యాప్తు జరిపి శిక్షిస్తామన్నారు.

మల్లీశ్వరి మాటలకు అజయ్ నోట మాట రాలేదు.. పైగా మల్లీశ్వరి ఎంతో కాన్ఫిడెన్స్ తో 2029లో తమ ప్రభుత్వం వస్తుందని నమ్మడం.. అలాగే జగన్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడినందుకు ఒక్కసారిగా విరుచుకు పడడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకురాలు కదా మనకి కావాల్సింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు..

కూటమి నేతలు కామంతో రెచ్చిపోతున్నారు – హరీష్

అధికారన్ని అడ్డం పెట్టుకుని జనసేన, టీడీపీ నేతలు కామంతో రెచ్చిపోతున్నారని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ యువ నాయకులు గొంతే హరీష్ ఆరోపించారు. జనసేన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని వాడుకొని వదిలేసాడని, తనకి పెళ్లై కొడుకు కూడా ఉన్నాడని తెలిసినా కానీ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కారులో దూరంగా తీసుకెళ్లి రేప్ చేశాడంటూ బాధిత మహిళ చెప్తోందన్నారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, గతంలో సాక్ష్యాత్తూ మంత్రి వాసంశెట్టి సుభాస్ అశ్లీల నృత్యాల్లో పాల్గొనడం ఎంతవరకూ కరెక్ట్ అని హరీష్ ప్రశ్నించారు. కూటమిప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం చేయలేదని, కేవలం అరాచకాలు, అకృత్యాలు మాత్రమే చేస్తోందన్నారు. వచ్చే జగన్ 2.0 పాలనలో మహిళల రక్షణకు దిశ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి అభివృద్ధి చేసే పార్టీ వైసీపీ మాత్రమేనన్నారు హరీష్..

TOP