September 12, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్ధం కాలేదు..

బాలకృష్ణ శోభన్ బాబు మల్టీ స్టారర్ , ఇళయరాజా అల్టిమేట్ సాంగ్స్, మీనా నగ్మా లాంటి టాప్ హీరోయిన్స్,అమ్రిష్ పురి విలన్, రాఘవేంద్ర రావు డైరెక్షన్ ….హై బడ్జెట్ తో, ఆకాశాన్నంటే అంచనాలతో రిలీజ్ అయిన మూవీ. శోభన్ బాబు పాత్రను మధ్యలో చంపేయడం, క్లైమాక్స్ సాగదీత, అక్కడ సాంగ్ పెట్టడం..మూవీ పరాజయానికి కారణాలు. గజిని మూవీలో విలన్ క్యారక్టర్ లో ట్విస్ట్ అశ్వమేధం లో ఎప్పుడో పెట్టారు.

శోభన్ గారి ఫాన్స్ అయన సూసైడ్ చేసుకునే సీన్ తీసేయమని గొడవ చేసారు. కేవలం మాకు మాత్రమే మంచి హిట్ ఇవ్వలేదనే కోపంతో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ లో ఉన్న రాఘవేంద్ర రావు మీదకు గొడవకు వెళ్లారు బాలయ్య ఫాన్స్. ఈ సినిమా తర్వాత రాఘవేంద్ర రావు తో కానీ, అశ్వనీదత్ తో కానీ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారు బాలయ్య. కానీ రాఘవేంద్ర రావు తో ఎప్పటికో పాండు రంగడు చేసారు. అయితే అశ్వమేధం మూవీ మాత్రం ఎప్పుడు టీవీ లో చూసినా "బాగుందే , ఎందుకు ప్లాప్ అయిందబ్బా " అనిపిస్తుంది

శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం

ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌ రాజు సభా కార్యకలాపాలు మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.

‘వెంకీ అనిల్-5’పై ఆసక్తికర అప్‌డేట్

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వెంకీ అనిల్ 5’పై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సక్సెస్ తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

తాజాగా విడుదలైన ఆయన లుక్‌లో పూర్తిగా కొత్తగా, గంభీరమైన మిలటరీ అధికారిగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. వెంకటేష్ గతంలో చేసిన ఫ్యామిలీ, కామెడీ, ఎమోషనల్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో మిలటరీ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొనసాగిస్తూనే కథలో యాక్షన్, ఎమోషన్‌ను కూడా మేళవిస్తున్నట్లు సమాచారం. వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు కొత్త తరహా యాక్షన్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులను కూడా టార్గెట్ చేసేలా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లెఫ్టినెంట్ కర్నల్ పాత్ర కోసం వెంకటేష్ లుక్‌ను మార్చడం సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. సినిమాలో ఆయన పాత్ర కథను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, మిలటరీ నేపథ్యం ఎంతవరకు కీలకంగా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అనిల్ రావిపూడి–వెంకటేష్ కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ కొత్త అవతారం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారేలా కనిపిస్తోంది.

ఏడేళ్ల సస్పెన్స్ కు తెర: సరికొత్త లుక్ లో రెబల్ స్టార్ ‘ఇన్‌స్టా DP’ వైరల్!

హైదరాబాద్: పాన్-ఇండియా కటౌట్, రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్నా సరే... ఆయన పేరు వినిపిస్తే చాలు రికార్డులు తిరగబడాల్సిందే. స్క్రీన్ పైనే కాదు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా చేసిన ఒక చిన్న మార్పు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఏకంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ డిస్‌ప్లే పిక్చర్ (DP)ను మార్చడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

2017 తర్వాత మళ్లీ ఇప్పుడే... ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి అంటే దాదాపు ఏడేళ్లుగా ఒకే ఫొటో (బాహుబలి లుక్ లేదా పాత పిక్) మాత్రమే డిపీగా ఉండేది. సాధారణంగా స్టార్ హీరోలు తమ ప్రతి సినిమా విడుదల సమయంలోనో, లేదా ఏదైనా షూట్ ఉన్నప్పుడో తరచూ DPలు మారుస్తూ ఉంటారు. కానీ, ప్రభాస్ శైలి వేరు. ఆర్బాటం లేని జీవితాన్నిష్టపడే ప్రభాస్, సోషల్ మీడియా యాక్టివిటీకి కాస్త దూరంగానే ఉంటారు. అలాంటిది అకస్మాత్తుగా ఆయన తన ప్రోఫైల్ పిక్చర్ మార్చేసరికి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

కొత్త లుక్... నయా వైబ్! తాజాగా ప్రభాస్ అప్‌డేట్ చేసిన DPలో ఆయన అత్యంత స్టైలిష్ గా, రాయల్ లుక్ లో కనిపిస్తున్నారు. చార్మింగ్ షేడ్స్, పవర్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న ఈ పిక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. "ఏడేళ్ల నిరీక్షణకు తగిన న్యాయం జరిగింది", "కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్!" అంటూ సోషల్ మీడియా కామెంట్ సెక్షన్లలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాన్ పేజీలు, ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ ఫొటో నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

అప్ కమింగ్ సినిమాల మేనియానేనా? అయితే, ప్రభాస్ అకస్మాత్తుగా DP మార్చడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనే చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. దర్శకుడు మారుతితో చేస్తున్న భారీ ఎంటర్‌టైనర్, అలాగే సందీప్ రెడ్డి వంగాతో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్', ప్రశాంత్ నీల్ తో 'సలార్ 2' కాంబినేషన్లు లైనప్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే రాబోయే కొత్త సినిమా అప్‌డేట్‌కు సంకేతంగానే ఈ లుక్ మార్చారా? లేక ఇది కేవలం ఒక క్యాజువల్ చేంజ్ మాత్రమేనా? అని సినీ విశ్లేషకులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు.

సోషల్ మీడియాలో 'ప్రభాస్ హవా' ఏది ఏమైనా, ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా కేవలం ప్రొఫైల్ పిక్చర్ మార్చడం ద్వారానే మిలియన్ల కొద్దీ లైక్స్, వేలాది కామెంట్స్ రాబట్టడం ఒక్క ప్రభాస్‌కే సాధ్యమైంది. డిజిటల్ మీడియాలో ఆయనకున్న తిరుగులేని క్రేజ్‌కు ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం 'రాయల్ ప్రభాస్' డిపీ సోషల్ మీడియా వేదికలపై సంచలనం సృష్టిస్తూ, ట్రెండింగ్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

జగన్ సారధ్యంలో జాతికోసం మరింతగా..!

పిన్న వయసులోనే జాతికోసం ఆలోచించాడా యువకుడు.. రాష్ట్రస్థాయి జర్నలిస్టుగా, మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్న తరుణంలోనే కెరీర్ ను పణంగా పెట్టి కులం కోసం నడుంబిగించాడు.. 2018లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ స్థాపించాడు.. దూదేకుల ముస్లింలకు సరైన గుర్తింపు గౌరవం దక్కడం లేదని గొంతెత్లి నినదించాడు.. అమరావతిలో పొలిటికల్ జేఏసీ ప్రారంభించి అక్కడే కార్యాలయాన్ని నెలకొల్పాడు.. 2019 ఎన్నికల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, దూదేకుల సమాజానికి తన ఉద్దేశాన్ని బలంగా చాటిచెప్పాడు..

ఉన్నత వర్గాల్లోని రాజకీయ కుటుంబాల్లో ఒకే కుటుంబం లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లు ఉండొచ్చు కానీ వెనుకబడిన, విస్మరించబడిన దూదేకుల జాతినుండి ఒక్క ఎమ్మెల్యే ఉండకూడదా అని ప్రశ్నించాడు.. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడమే కాదు.. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ నినాదాన్ని వదిలిపెట్టలేదు.. ప్రధాన మీడియా చానెళ్లలో డిబేట్లు, పత్రికల్లో వార్తలు ఊపందుకున్నాయి. దూదేకుల కులం గురించి సర్వత్రా చర్చించుకున్నారు. కేవలం దస్తగిరి అనే యువకుడు నడుం బిగించడం వల్లే..కేవలం రాజకీయ అజెండానే కాదు దూదేకుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసాడు.. దూదేకుల కులం ఎదుర్కుంటున్న అసభ్య పదాలను తొలగిస్తూ జీవో తెచ్చిన ఘనత దస్తగిరిదే.. అసలు దూదేకుల కమ్యూనిటీ పేరుతో జివో రావడమే మొదటిది..

దస్తగిరి పోరాటాన్ని గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించింది. పార్టీలో చేరిన వెనువెంటనే వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి సాధించాడు.. దస్తగిరి చేస్తున్నది రాజకీయ పోరాటమే, దూదేకుల ఉనికిని బ్రతికించడమో కాదు.. అధికారంలో భాగస్వామ్యం, ఆత్మగౌరవ పోరాటం.. దూదేకులంటే ముస్లిం సమాజంలోని ఒక వర్గం కాదు రాష్ట్రంలోని ప్రధాన కులాల్లో మాదీ సింహభాగమేనన్న గుర్తింపు.. చిన్న వయసునుండే పోరాటాలు, కులం కోసం ఉద్యమాలు చేపట్టిన దస్తగిరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, జాతికోసం మరింత వేగంగా అడుగులు వేయాలని యావత్ దూదేకుల సమాజం ఆశిస్తోంది.. ఆశీర్వదిస్తోంది..

కాకినాడ ప్రమాదంపై దస్తగిరి దిగ్బ్రాంతి..

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై వైసీపీ నేత దస్తగిరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. ఈ భారీ పేలుడు విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం కావడం అత్యంత విషాదకరమన్నారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.

భార్య జ్ఞాపకార్థం సీఫీకి సోలార్ లైటింగ్, ఫ్యాన్‌లు బహూకరించిన శాంతమూర్తి

హైదరాబాద్ ఆర్.టి.సి క్రాస్ రోడ్డులోని తెలుగు సీఫీ క్రైస్తవ విద్యాసేవ కార్యాలయంలో శ్రీమతి రాచకొండ విజయకుమారి గారి జ్ఞాపకార్థం వారి భర్త శాంతమూర్తి సోలార్ లైటింగ్ సిస్టమ్ మరియు ఫ్యాన్‌లను బహూకరించారు. ఈ సోలార్ లైటింగ్ సిస్టమ్‌ను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి వై.ఎస్. విమలా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాచకొండ విజయకుమారి గారు దేవునియందు భయ భక్తులు కలిగినవారు, విద్యార్థుల పట్ల అంకితభావం కలిగిన ఉత్తమ ఉపాధ్యాయురాలని పేర్కొన్నారు.

ఆమె విద్యార్థుల మనసుల్లో చెరగని ముద్రవేసినారని కొనియాడారు. సెప్టెంబర్ 2025లో తెలుగు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రభుత్వ తరఫున అందుకున్న ఆమె సేవలు ప్రశంసనీయమని తెలిపారు. విజయకుమారి జ్ఞాపకార్థం తెలుగు సీఫీ కార్యాలయంలో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయించిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆమె గుర్తుగా శాంతమూర్తి ఈ కార్యక్రమం నిర్వహించడంపై అభినందించారు. భార్యపై ప్రేమను ఈ విధంగా చాటుకోవడం గొప్పవిషయమని పలువురు కొనియాడారు. ఈ సోలార్ సిస్టమ్‌ను son.et Lumiere సంస్థ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, పృధ్వీరాజ్ రెడ్డి, జయప్రకాశ్, జగన్ మోహన్ రెడ్డి, టి.సురేష్, మౌనిక, ఆశ ప్రశాంతి, ఫిలిప్, భాస్కర్, భారతీ భాస్కర్, చల్లా శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

దాదా మృతిపట్ల జగన్ దిగ్భ్రాంతి

YS Jagan: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో అకాల మృతి పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అజిత్‌ పవార్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. వారిఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు చేశారు.

మహారాష్ట్ర బారామతిలో ల్యాండింగ్ సమయంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

హైల్మెట్ తలకు భారం కాదు.. బాధ్యత..!

37వ జాతీయ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా సేఫ్ ఏ, ఎన్ హెచ్ ఐ మరియు తణుకు MVI ఎస్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో తణుకు ఉమెన్స్ కాలేజ్ హైవే 216Aపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఉపయోగాలను వివరించారు. హైల్మెట్ తలకు భారం కాదని బాధ్యతగా ధరించడం వల్ల ప్రాణాపాయం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు. కారుల్లోప్రయాణించే వ్యక్తులకు సీట్ బెల్ట్ ఉపయోగాలు తెలియజేసారు.
ప్రాజెక్ట్ మేనేజర్ కే బాలసుబ్రమణ్యం, వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, హైవే సిబ్బంది పాల్గొన్నారు.

APGEA పామర్రు యూనిట్ కార్యవర్గం ఎన్నిక

ఆంధ్ర ప్రదేశ్ (కృష్ణా - పామర్రు) : ది. 26-1-2026న APGEA పామర్రు యూనిట్ కార్యవర్గం యొక్క ఎన్నికలు పామర్రు నందు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల కోసం APGEA కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులు అయినటువంటి శ్రీ టి. రాము గారి ఆద్వర్యంలో, జిల్లా కార్యవర్గంచే జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ తోట ప్రసాద్ ను ఎలక్షన్ ఆఫీసర్ గా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ కోటేశ్వరరావును అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించడమైనది. కావున ఎలక్షన్ ప్రక్రియను వారు నిర్వహించి పామర్రు యూనిట్ యొక్క APGEA కార్యవర్గాన్ని ప్రకటించారు.

ఎన్నికల ఫలితాలలో షేక్ మెహరున్నిస బేగం అధ్యక్షలుగా ఎన్నిక అయ్యారు. కె విజయ కుమార్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా, యన్ ఆంజనేయలు ప్రధాన కార్యదర్శిగా, శివ నాగమణి కోశాదికారి గా ఎన్నిక అయ్యారు.

APGEA పామర్రు యూనిట్ మాజీ అధ్యక్షులు అయిన శ్రీ కొలుసు యేసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

మొత్తం 17 మందితో కూడిన ఈ టీం యొక్క వివరాలు

1) అధ్యక్షులు – షేక్ మెహరున్నీసా బేగం
2) అసోసియేట్ ప్రెసిడెంట్ – కె. విజయ్ కుమార్
3) ప్రధాన కార్యదర్శి – యన్ యన్ ఆంజనేయులు
4) కోశాధికారి – యమ్. శివనాగ మణి
5) ఆర్గనైజింగ్ సెక్రటరీ – ఆర్.లక్ష్మయ్య
6) వైస్ ప్రెసిడెంట్ 1 – యమ్. సబెరుద్దిన్
7) వైస్ ప్రెసిడెంట్ 2 – అరుణకుమారి
8) వైస్ ప్రెసిడెంట్ 3 – పరంజ్యోతి
9) వైస్ ప్రెసిడెంట్ 4 - యమ్. సతీష్
10) వైస్ ప్రెసిడెంట్ 5 – కె. సాయి బాబు
11) వైస్ ప్రెసిడెంట్ 6 - పి రాజారావు
12) జాయింట్ సెక్రటరీ 1 – అమృతరావు
13) జాయింట్ సెక్రటరీ 2 – ఆర్. రామ కృష్ణ
14) జాయింట్ సెక్రటరీ 3 – యం.అలీ
15) జాయింట్ సెక్రటరీ 4 – యం. బ్రహ్మ నాయుడు
16) జాయింట్ సెక్రటరీ 5 - యమ్. లీలా కృష్ణా
17) జాయింట్ సెక్రటరీ 6 - జి రమాదేవి

TOP