April 16, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

జగన్ సారధ్యంలో జాతికోసం మరింతగా..!

పిన్న వయసులోనే జాతికోసం ఆలోచించాడా యువకుడు.. రాష్ట్రస్థాయి జర్నలిస్టుగా, మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్న తరుణంలోనే కెరీర్ ను పణంగా పెట్టి కులం కోసం నడుంబిగించాడు.. 2018లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ స్థాపించాడు.. దూదేకుల ముస్లింలకు సరైన గుర్తింపు గౌరవం దక్కడం లేదని గొంతెత్లి నినదించాడు.. అమరావతిలో పొలిటికల్ జేఏసీ ప్రారంభించి అక్కడే కార్యాలయాన్ని నెలకొల్పాడు.. 2019 ఎన్నికల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, దూదేకుల సమాజానికి తన ఉద్దేశాన్ని బలంగా చాటిచెప్పాడు..

ఉన్నత వర్గాల్లోని రాజకీయ కుటుంబాల్లో ఒకే కుటుంబం లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లు ఉండొచ్చు కానీ వెనుకబడిన, విస్మరించబడిన దూదేకుల జాతినుండి ఒక్క ఎమ్మెల్యే ఉండకూడదా అని ప్రశ్నించాడు.. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడమే కాదు.. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ నినాదాన్ని వదిలిపెట్టలేదు.. ప్రధాన మీడియా చానెళ్లలో డిబేట్లు, పత్రికల్లో వార్తలు ఊపందుకున్నాయి. దూదేకుల కులం గురించి సర్వత్రా చర్చించుకున్నారు. కేవలం దస్తగిరి అనే యువకుడు నడుం బిగించడం వల్లే..కేవలం రాజకీయ అజెండానే కాదు దూదేకుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసాడు.. దూదేకుల కులం ఎదుర్కుంటున్న అసభ్య పదాలను తొలగిస్తూ జీవో తెచ్చిన ఘనత దస్తగిరిదే.. అసలు దూదేకుల కమ్యూనిటీ పేరుతో జివో రావడమే మొదటిది..

దస్తగిరి పోరాటాన్ని గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించింది. పార్టీలో చేరిన వెనువెంటనే వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి సాధించాడు.. దస్తగిరి చేస్తున్నది రాజకీయ పోరాటమే, దూదేకుల ఉనికిని బ్రతికించడమో కాదు.. అధికారంలో భాగస్వామ్యం, ఆత్మగౌరవ పోరాటం.. దూదేకులంటే ముస్లిం సమాజంలోని ఒక వర్గం కాదు రాష్ట్రంలోని ప్రధాన కులాల్లో మాదీ సింహభాగమేనన్న గుర్తింపు.. చిన్న వయసునుండే పోరాటాలు, కులం కోసం ఉద్యమాలు చేపట్టిన దస్తగిరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, జాతికోసం మరింత వేగంగా అడుగులు వేయాలని యావత్ దూదేకుల సమాజం ఆశిస్తోంది.. ఆశీర్వదిస్తోంది..

కాకినాడ ప్రమాదంపై దస్తగిరి దిగ్బ్రాంతి..

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై వైసీపీ నేత దస్తగిరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. ఈ భారీ పేలుడు విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం కావడం అత్యంత విషాదకరమన్నారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.

భార్య జ్ఞాపకార్థం సీఫీకి సోలార్ లైటింగ్, ఫ్యాన్‌లు బహూకరించిన శాంతమూర్తి

హైదరాబాద్ ఆర్.టి.సి క్రాస్ రోడ్డులోని తెలుగు సీఫీ క్రైస్తవ విద్యాసేవ కార్యాలయంలో శ్రీమతి రాచకొండ విజయకుమారి గారి జ్ఞాపకార్థం వారి భర్త శాంతమూర్తి సోలార్ లైటింగ్ సిస్టమ్ మరియు ఫ్యాన్‌లను బహూకరించారు. ఈ సోలార్ లైటింగ్ సిస్టమ్‌ను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి వై.ఎస్. విమలా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాచకొండ విజయకుమారి గారు దేవునియందు భయ భక్తులు కలిగినవారు, విద్యార్థుల పట్ల అంకితభావం కలిగిన ఉత్తమ ఉపాధ్యాయురాలని పేర్కొన్నారు.

ఆమె విద్యార్థుల మనసుల్లో చెరగని ముద్రవేసినారని కొనియాడారు. సెప్టెంబర్ 2025లో తెలుగు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రభుత్వ తరఫున అందుకున్న ఆమె సేవలు ప్రశంసనీయమని తెలిపారు. విజయకుమారి జ్ఞాపకార్థం తెలుగు సీఫీ కార్యాలయంలో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయించిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆమె గుర్తుగా శాంతమూర్తి ఈ కార్యక్రమం నిర్వహించడంపై అభినందించారు. భార్యపై ప్రేమను ఈ విధంగా చాటుకోవడం గొప్పవిషయమని పలువురు కొనియాడారు. ఈ సోలార్ సిస్టమ్‌ను son.et Lumiere సంస్థ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, పృధ్వీరాజ్ రెడ్డి, జయప్రకాశ్, జగన్ మోహన్ రెడ్డి, టి.సురేష్, మౌనిక, ఆశ ప్రశాంతి, ఫిలిప్, భాస్కర్, భారతీ భాస్కర్, చల్లా శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

దాదా మృతిపట్ల జగన్ దిగ్భ్రాంతి

YS Jagan: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో అకాల మృతి పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అజిత్‌ పవార్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. వారిఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు చేశారు.

మహారాష్ట్ర బారామతిలో ల్యాండింగ్ సమయంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

హైల్మెట్ తలకు భారం కాదు.. బాధ్యత..!

37వ జాతీయ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా సేఫ్ ఏ, ఎన్ హెచ్ ఐ మరియు తణుకు MVI ఎస్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో తణుకు ఉమెన్స్ కాలేజ్ హైవే 216Aపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఉపయోగాలను వివరించారు. హైల్మెట్ తలకు భారం కాదని బాధ్యతగా ధరించడం వల్ల ప్రాణాపాయం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు. కారుల్లోప్రయాణించే వ్యక్తులకు సీట్ బెల్ట్ ఉపయోగాలు తెలియజేసారు.
ప్రాజెక్ట్ మేనేజర్ కే బాలసుబ్రమణ్యం, వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, హైవే సిబ్బంది పాల్గొన్నారు.

APGEA పామర్రు యూనిట్ కార్యవర్గం ఎన్నిక

ఆంధ్ర ప్రదేశ్ (కృష్ణా - పామర్రు) : ది. 26-1-2026న APGEA పామర్రు యూనిట్ కార్యవర్గం యొక్క ఎన్నికలు పామర్రు నందు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల కోసం APGEA కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులు అయినటువంటి శ్రీ టి. రాము గారి ఆద్వర్యంలో, జిల్లా కార్యవర్గంచే జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ తోట ప్రసాద్ ను ఎలక్షన్ ఆఫీసర్ గా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ కోటేశ్వరరావును అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించడమైనది. కావున ఎలక్షన్ ప్రక్రియను వారు నిర్వహించి పామర్రు యూనిట్ యొక్క APGEA కార్యవర్గాన్ని ప్రకటించారు.

ఎన్నికల ఫలితాలలో షేక్ మెహరున్నిస బేగం అధ్యక్షలుగా ఎన్నిక అయ్యారు. కె విజయ కుమార్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా, యన్ ఆంజనేయలు ప్రధాన కార్యదర్శిగా, శివ నాగమణి కోశాదికారి గా ఎన్నిక అయ్యారు.

APGEA పామర్రు యూనిట్ మాజీ అధ్యక్షులు అయిన శ్రీ కొలుసు యేసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

మొత్తం 17 మందితో కూడిన ఈ టీం యొక్క వివరాలు

1) అధ్యక్షులు – షేక్ మెహరున్నీసా బేగం
2) అసోసియేట్ ప్రెసిడెంట్ – కె. విజయ్ కుమార్
3) ప్రధాన కార్యదర్శి – యన్ యన్ ఆంజనేయులు
4) కోశాధికారి – యమ్. శివనాగ మణి
5) ఆర్గనైజింగ్ సెక్రటరీ – ఆర్.లక్ష్మయ్య
6) వైస్ ప్రెసిడెంట్ 1 – యమ్. సబెరుద్దిన్
7) వైస్ ప్రెసిడెంట్ 2 – అరుణకుమారి
8) వైస్ ప్రెసిడెంట్ 3 – పరంజ్యోతి
9) వైస్ ప్రెసిడెంట్ 4 - యమ్. సతీష్
10) వైస్ ప్రెసిడెంట్ 5 – కె. సాయి బాబు
11) వైస్ ప్రెసిడెంట్ 6 - పి రాజారావు
12) జాయింట్ సెక్రటరీ 1 – అమృతరావు
13) జాయింట్ సెక్రటరీ 2 – ఆర్. రామ కృష్ణ
14) జాయింట్ సెక్రటరీ 3 – యం.అలీ
15) జాయింట్ సెక్రటరీ 4 – యం. బ్రహ్మ నాయుడు
16) జాయింట్ సెక్రటరీ 5 - యమ్. లీలా కృష్ణా
17) జాయింట్ సెక్రటరీ 6 - జి రమాదేవి

బెస్ట్ బూత్ లెవల్ ఆఫీసర్‌గా రాజారావు..

పామర్రు:

కృష్ణా జిల్లా స్థాయిలో పామర్రు నియోజకవర్గం తరుపున పెరుమాళ్ల రాజారావు ఉత్తమ బిఎల్‌ఓగా ఎంపికయ్యారు. పెదపారుపూడి మండలం చినపారుపూడి స్వర్ణ గ్రామ కార్యాలయం నందు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాజారావు అదే సచివాలయ పరిధిలో ఉన్న అప్పికట్ల గ్రామ పోలింగ్ బూత్‌ నందు బూత్ లెవల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా భారత ఎన్నికలసంఘం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్నం దు రాజారావు ఉత్తమ పనితనం కనబరిచారు. పామర్రు నియోజకవర్గం ఎన్నికల హెడ్ ఆఫీస్ అయినటువంటి పామర్రు ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఫోన్ చేసి నియోజకవర్గం తరుపున ఉత్తమ బిఎల్‌ఓగా ఎంపికైన విషయాన్ని రాజారావుకు తెలియజేశారు. ది. 25-1-26న 16వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టరేట్ నందు కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతిని రాజారావు అందుకోనున్నారు. ఈ సందర్భంగా రాజారావుకు పెదపారుపూడి మండలంలో ఉన్న తోటి బిఎల్‌ఓలు, తోటి సచివాలయ ఉద్యోగులు, ఎంపిడీఓ, ఎమ్మార్వో కార్యాలయం వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

జగన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలుగు ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ సార్వభౌమత్వాన్ని ఘనంగా జరుపుకుందాం. ఐక్యత, అభివృద్ధికి ప్రేరణనిస్తూ జాతీయ జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్’ అని పేర్కొన్నారు.

TOP