April 16, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

జగన్ సారధ్యంలో జాతికోసం మరింతగా..!

పిన్న వయసులోనే జాతికోసం ఆలోచించాడా యువకుడు.. రాష్ట్రస్థాయి జర్నలిస్టుగా, మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్న తరుణంలోనే కెరీర్ ను పణంగా పెట్టి కులం కోసం నడుంబిగించాడు.. 2018లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ స్థాపించాడు.. దూదేకుల ముస్లింలకు సరైన గుర్తింపు గౌరవం దక్కడం లేదని గొంతెత్లి నినదించాడు.. అమరావతిలో పొలిటికల్ జేఏసీ ప్రారంభించి అక్కడే కార్యాలయాన్ని నెలకొల్పాడు.. 2019 ఎన్నికల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, దూదేకుల సమాజానికి తన ఉద్దేశాన్ని బలంగా చాటిచెప్పాడు..

ఉన్నత వర్గాల్లోని రాజకీయ కుటుంబాల్లో ఒకే కుటుంబం లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లు ఉండొచ్చు కానీ వెనుకబడిన, విస్మరించబడిన దూదేకుల జాతినుండి ఒక్క ఎమ్మెల్యే ఉండకూడదా అని ప్రశ్నించాడు.. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడమే కాదు.. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ నినాదాన్ని వదిలిపెట్టలేదు.. ప్రధాన మీడియా చానెళ్లలో డిబేట్లు, పత్రికల్లో వార్తలు ఊపందుకున్నాయి. దూదేకుల కులం గురించి సర్వత్రా చర్చించుకున్నారు. కేవలం దస్తగిరి అనే యువకుడు నడుం బిగించడం వల్లే..కేవలం రాజకీయ అజెండానే కాదు దూదేకుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసాడు.. దూదేకుల కులం ఎదుర్కుంటున్న అసభ్య పదాలను తొలగిస్తూ జీవో తెచ్చిన ఘనత దస్తగిరిదే.. అసలు దూదేకుల కమ్యూనిటీ పేరుతో జివో రావడమే మొదటిది..

దస్తగిరి పోరాటాన్ని గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించింది. పార్టీలో చేరిన వెనువెంటనే వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి సాధించాడు.. దస్తగిరి చేస్తున్నది రాజకీయ పోరాటమే, దూదేకుల ఉనికిని బ్రతికించడమో కాదు.. అధికారంలో భాగస్వామ్యం, ఆత్మగౌరవ పోరాటం.. దూదేకులంటే ముస్లిం సమాజంలోని ఒక వర్గం కాదు రాష్ట్రంలోని ప్రధాన కులాల్లో మాదీ సింహభాగమేనన్న గుర్తింపు.. చిన్న వయసునుండే పోరాటాలు, కులం కోసం ఉద్యమాలు చేపట్టిన దస్తగిరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, జాతికోసం మరింత వేగంగా అడుగులు వేయాలని యావత్ దూదేకుల సమాజం ఆశిస్తోంది.. ఆశీర్వదిస్తోంది..

వరకట్న వేధింపులు.. కాపురానికి వెళ్లిన మహిళపై భర్త కుటుంబసభ్యుల దాడి!

కృష్ణా జిల్లా, నందివాడ మండలం, తరిమిస గ్రామంలో ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన విజయలక్ష్మిపై ఆమె భర్త రఘునాథ్, అతని తల్లి శ్రీవల్లి తీవ్రంగా దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరుకు చెందిన విజయలక్ష్మిని తరిమిస గ్రామానికి చెందిన రఘునాథ్ వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తూ, అనేకసార్లు తనపై దాడులు చేశారని విజయలక్ష్మి ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పలుమార్లు సంధి జరిగినప్పటికీ, భర్త రఘునాథ్, అతని తల్లి శ్రీవల్లి వేధింపులు కొనసాగించారని తెలిపింద
ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా విజయలక్ష్మి తన తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటోంది. ఈ క్రమంలో రేపల్లెలో నివసిస్తున్న రఘునాథ్ అన్నయ్య ఫోన్ చేసి, “ఇకపై వేధింపులు ఉండవు, జాగ్రత్తగా చూసుకుంటాం” అంటూ కాపురానికి రావాలని కోరడంతో, నిన్న తన భర్త ఇంటికి వెళ్లినట్లు తెలిపింది.

అయితే అక్కడికి వెళ్లిన వెంటనే “నిన్నెవరు రమ్మన్నారు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు డబ్బులు కావాలి” అంటూ భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి తీవ్రంగా దూషించి, కర్రలతో విజయలక్ష్మిపై, ఆమె తండ్రి గోవింద రాజాచార్యులపై దాడి చేశారని ఆరోపించింది. అంతేకాకుండా తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొంది.

దాడిలో తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు మెడికల్ లీగల్ కేసు (MLC)గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తనపై, తన తండ్రిపై దాడి చేసిన భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి పై కఠిన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి డిమాండ్ చేస్తోంది.

TOP