April 16, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

జగన్ సారధ్యంలో జాతికోసం మరింతగా..!

పిన్న వయసులోనే జాతికోసం ఆలోచించాడా యువకుడు.. రాష్ట్రస్థాయి జర్నలిస్టుగా, మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్న తరుణంలోనే కెరీర్ ను పణంగా పెట్టి కులం కోసం నడుంబిగించాడు.. 2018లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ స్థాపించాడు.. దూదేకుల ముస్లింలకు సరైన గుర్తింపు గౌరవం దక్కడం లేదని గొంతెత్లి నినదించాడు.. అమరావతిలో పొలిటికల్ జేఏసీ ప్రారంభించి అక్కడే కార్యాలయాన్ని నెలకొల్పాడు.. 2019 ఎన్నికల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, దూదేకుల సమాజానికి తన ఉద్దేశాన్ని బలంగా చాటిచెప్పాడు..

ఉన్నత వర్గాల్లోని రాజకీయ కుటుంబాల్లో ఒకే కుటుంబం లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లు ఉండొచ్చు కానీ వెనుకబడిన, విస్మరించబడిన దూదేకుల జాతినుండి ఒక్క ఎమ్మెల్యే ఉండకూడదా అని ప్రశ్నించాడు.. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడమే కాదు.. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ నినాదాన్ని వదిలిపెట్టలేదు.. ప్రధాన మీడియా చానెళ్లలో డిబేట్లు, పత్రికల్లో వార్తలు ఊపందుకున్నాయి. దూదేకుల కులం గురించి సర్వత్రా చర్చించుకున్నారు. కేవలం దస్తగిరి అనే యువకుడు నడుం బిగించడం వల్లే..కేవలం రాజకీయ అజెండానే కాదు దూదేకుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసాడు.. దూదేకుల కులం ఎదుర్కుంటున్న అసభ్య పదాలను తొలగిస్తూ జీవో తెచ్చిన ఘనత దస్తగిరిదే.. అసలు దూదేకుల కమ్యూనిటీ పేరుతో జివో రావడమే మొదటిది..

దస్తగిరి పోరాటాన్ని గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించింది. పార్టీలో చేరిన వెనువెంటనే వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి సాధించాడు.. దస్తగిరి చేస్తున్నది రాజకీయ పోరాటమే, దూదేకుల ఉనికిని బ్రతికించడమో కాదు.. అధికారంలో భాగస్వామ్యం, ఆత్మగౌరవ పోరాటం.. దూదేకులంటే ముస్లిం సమాజంలోని ఒక వర్గం కాదు రాష్ట్రంలోని ప్రధాన కులాల్లో మాదీ సింహభాగమేనన్న గుర్తింపు.. చిన్న వయసునుండే పోరాటాలు, కులం కోసం ఉద్యమాలు చేపట్టిన దస్తగిరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, జాతికోసం మరింత వేగంగా అడుగులు వేయాలని యావత్ దూదేకుల సమాజం ఆశిస్తోంది.. ఆశీర్వదిస్తోంది..

కాకినాడ ప్రమాదంపై దస్తగిరి దిగ్బ్రాంతి..

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై వైసీపీ నేత దస్తగిరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. ఈ భారీ పేలుడు విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం కావడం అత్యంత విషాదకరమన్నారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.

ఉప ప్రధానిగా చంద్రబాబు !!?

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతల నుండి తప్పుకుని ఆ పగ్గాలను తన కుమారుడు నారా లోకేష్ చేతుల్లో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో ఈ మార్పు సహజంగానే జరుగుతుందని అంతా భావిస్తున్నారు. ఈ విషయంలో కూటమిలోని మరో ప్రధాన నేత పవన్ కళ్యాణ్ కు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రచారం జరుగుతోంది. లోకేష్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం కేవలం సమయం కోసమే వేచి చూస్తున్న ప్రక్రియలా కనిపిస్తోంది. బహుశా రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ఈ అధికార మార్పిడి జరిగి లోకేష్ రాష్ట్ర పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది.

చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల వైపు అడుగులు వేయడం

రాష్ట్ర రాజకీయాల నుండి తప్పుకున్నాక చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఆయన కేవలం ఒక సాధారణ కేంద్ర మంత్రిగా ఉండాలని అనుకోవడం లేదు. భారత ప్రభుత్వంలో ఉప ప్రధాని పదవిని దక్కించుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో అద్వానీ లాంటి నాయకులు నిర్వహించిన ఈ హోదాను తాను కూడా పొంది తన రాజకీయ ప్రస్థానాన్ని గౌరవప్రదంగా ముగించాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలుగుదేశం మద్దతుపై ఆధారపడి ఉండటంతో ఈ డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ పదవిని దక్కించుకోవడానికి ఆయన కేవలం రాజకీయ మార్గాలనే కాకుండా వ్యాపారవేత్తలు అలాగే వివిధ రంగాల ప్రముఖుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంబానీ మరియు అదానీ వంటి పారిశ్రామిక వేత్తలతో ఉన్న పాత పరిచయాలను ఈ దిశగా వాడుకుంటూ కేంద్ర పెద్దలను ఒప్పించే పనిలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది.

అయితే చంద్రబాబు నాయుడు అంచనాలకు కేంద్రంలోని బిజెపి నాయకత్వం ఎంతవరకు తలొగ్గుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో ఆయన ఎన్డీయే నుండి బయటకు వెళ్ళిన తీరును దృష్టిలో పెట్టుకుని కేంద్ర పెద్దలు ఆయనను పూర్తిగా నమ్మడం లేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనను ఉప ప్రధానిగా తీసుకోవడం కంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు కూడా ఒక వాదన ఉంది. కానీ చంద్రబాబు మాత్రం గవర్నర్ పదవికి వెళ్ళడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. రాబోయే పది పదిహేను ఏళ్లు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. తన కుమారుడికి రాష్ట్రంలో లైన్ క్లియర్ చేసి తాను ఢిల్లీలో కీలకమైన బాధ్యతలు చేపట్టడం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని ఆయన చూస్తున్నారు. ఒకవేళ ఉప ప్రధాని పదవి దక్కకపోతే రాజ్యసభ చైర్మన్ లేదా ఉప రాష్ట్రపతి పదవి అయినా సాధించాలని ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన మలుపులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

వరకట్న వేధింపులు.. కాపురానికి వెళ్లిన మహిళపై భర్త కుటుంబసభ్యుల దాడి!

కృష్ణా జిల్లా, నందివాడ మండలం, తరిమిస గ్రామంలో ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన విజయలక్ష్మిపై ఆమె భర్త రఘునాథ్, అతని తల్లి శ్రీవల్లి తీవ్రంగా దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరుకు చెందిన విజయలక్ష్మిని తరిమిస గ్రామానికి చెందిన రఘునాథ్ వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తూ, అనేకసార్లు తనపై దాడులు చేశారని విజయలక్ష్మి ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పలుమార్లు సంధి జరిగినప్పటికీ, భర్త రఘునాథ్, అతని తల్లి శ్రీవల్లి వేధింపులు కొనసాగించారని తెలిపింద
ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా విజయలక్ష్మి తన తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటోంది. ఈ క్రమంలో రేపల్లెలో నివసిస్తున్న రఘునాథ్ అన్నయ్య ఫోన్ చేసి, “ఇకపై వేధింపులు ఉండవు, జాగ్రత్తగా చూసుకుంటాం” అంటూ కాపురానికి రావాలని కోరడంతో, నిన్న తన భర్త ఇంటికి వెళ్లినట్లు తెలిపింది.

అయితే అక్కడికి వెళ్లిన వెంటనే “నిన్నెవరు రమ్మన్నారు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు డబ్బులు కావాలి” అంటూ భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి తీవ్రంగా దూషించి, కర్రలతో విజయలక్ష్మిపై, ఆమె తండ్రి గోవింద రాజాచార్యులపై దాడి చేశారని ఆరోపించింది. అంతేకాకుండా తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొంది.

దాడిలో తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు మెడికల్ లీగల్ కేసు (MLC)గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తనపై, తన తండ్రిపై దాడి చేసిన భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి పై కఠిన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి డిమాండ్ చేస్తోంది.

TOP