August 12, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

వైసీపీ రాష్ట్ర దూదేకుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దస్తగిరి

సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడేవారిని గుర్తించడంలో ఎప్పుడూ ముందుంటుంది. వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు, జర్నలిస్ట్, షేక్ దస్తగిరిని పార్టీ రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పిన్న వయసులోనే ఇటువంటి కీలకమైన రాష్ట్రస్థాయి బాధ్యత దక్కడం పట్ల వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మగౌరవ పోరాటాల దస్తగిరి: పోరాటమే ఊపిరిగా..
షేక్ దస్తగిరి పేరు వినగానే గుర్తుకువచ్చేది ఆయనలోని ప్రజా పోరాట పటిమ. చిన్నతనం నుంచే సామాజిక స్పృహ కలిగి, నూర్ బాషా/దూదేకుల వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన గళమెత్తారు. వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం, దూదేకుల సామాజిక వర్గ ఆత్మగౌరవం కోసం ఆయన రాజీలేని పోరాటాలు చేశారు.

అణగారిన వర్గాల సంక్షేమం కోసం దస్తగిరి చేపట్టిన నిరాహార దీక్షలు, నిర్వహించిన పోరాట వేదికలు ఆయనలోని పట్టుదలను, ప్రజా నిబద్ధతను చాటిచెప్పాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్షలకు దిగిన తీరు ఆయనలోని చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది.

జగన్ దృష్టిని ఆకర్షించిన నిబద్ధత
పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి తగిన గుర్తింపు లభిస్తుందనడానికి దస్తగిరి నియామకమే ఒక ఉదాహరణ. దూదేకుల సామాజిక వర్గ సంక్షేమానికి ఆయన పడిన తపన, జరిపిన ఉద్యమాలు వైయస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గంతో పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, దూదేకుల సామాజిక వర్గ ప్రతినిధులు దస్తగిరిని కలిసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

సమర్థవంతమైన నాయకత్వంతో కొత్త శకం
షేక్ దస్తగిరి నాయకత్వంలో వైయస్ఆర్సీపీ నూర్ బాషా/దూదేకుల విభాగం మరింత క్రియాశీలకంగా మారనుందనడంలో సందేహం లేదు. చిన్న వయసులోనే ఈ స్థాయి ప్రాతినిధ్యం పొందిన దస్తగిరి, రాబోయే రోజుల్లో పార్టీ పరంగానూ మరియు సామాజికంగానూ తన ముద్ర వేస్తూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దస్తగిరి శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ..
"నన్ను నమ్మి ఈ చిన్న వయసులోనే రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన మన ప్రియతమ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని,. నూర్ బాషా, దూదేకుల సామాజిక వర్గాల సంక్షేమం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని మూలమూలలా ఉన్న నూర్ బాషా సోదరులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కిందకు తెచ్చి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తాను."

TOP