February 14, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

ఢిల్లీలో బీసీ గొంతుకై నినదిస్తున్న మారేష్.. మోదీ సాక్షిగా 10లక్షలమందితో..

దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు చట్టసభలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్‌ చేశారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27శాతం నుంచి 56 శాతానికి పెంచాలని కోరారు. విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న బీసీ క్రిమిలేయర్‌ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ, తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బీసీల మేధోమదన సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. మారేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీజేపీ ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, పాకా సత్యనారాయణ, టీడీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, కలిశెట్టి అప్పలనాయుడు, బస్తీపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల డిమాండ్ల సాధన, ఆత్మగౌరవం కోసం బీసీలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

వచ్చే ఏప్రిల్‌లో 10 లక్షల మందితో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా బీసీ గర్జన బహిరంగ సభను నిర్వహించబోతున్నామని తెలిపారు. బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్‌ను తీసుకురావాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కాగా, కేంద్రం రూ.2 లక్షల కోట్లతో బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని పాకా సత్యనారాయణ కోరారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు నేటికీ అందని ద్రాక్షలాగా ఉండటం దురదృష్టకరమని ఎంపీ బస్తీపాటి నాగరాజు అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో చట్టసభలలో బీసీలకు సరైన న్యాయం జరగాలంటే పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించాలని, దేశవ్యాప్తంగా కులగణన త్వరితగతిన చేపట్టాలని ఎన్‌.మారే్‌ష డిమాండ్‌ చేశారు.

అజయ్ ను చట్టపరంగా శిక్షిస్తాం.. జగన్ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన మల్లీశ్వరి

ఏపీ రాజకీయాల్లో తెనాలి మహిళ గీతాంజలి మరణం వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి, సోషల్ మీడియా వార్‌కు ఆఘటన కారణయమైంది. టీడీపీ , జనసేన ట్రోలింగ్ కారణంగానే మానసిక వేదనతో గీతాంజలి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపించారు. అప్పటి వైసీపీ మంత్రులు గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ కేసులో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి అజయ్ సజ్జాను గతంలో పోలీసులు అరెస్టు చేసారు. అజయ్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయటం వల్లే గీతాంజలి మృతి చెందిందని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. అనంతరం అజయ్ బెయిల్ పై విడుదలయ్యారు.. ఇదంతా గతం..

అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చిందంటే.. వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లీశ్వరి ఇటీవల ఓ టీవీ చానల్ డిబేట్ లో మాట్లాడుతున్నారు.. అదే డిబేట్ లో టీడీపీ తరపున పాల్గొన్న అజయ్ సజ్జా సబ్జెక్ట్ మాట్లాడకుండా జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే అనే పదం ఉపయోగించారు. వెంటనే కోపం చిర్రెత్తుకురావడంతో మల్లీశ్వరి రెచ్చిపోయారు. దమ్ము ధైర్యం లాంటి పదాలు ఉపయోగించవద్దని ఇప్పటికే లక్షసార్లు చెప్పానని అయినా నువ్వు మారడం లేదన్నారు. ఇలా విసిగించే గీతాంజలి మరణానికి కారణమయ్యావని, 2029లో వైసీపీ ప్రభుత్వం రాగానే కచ్చితంగా ఇందుకు మూల్యం చెల్లించుకుంటావని, చట్టపరంగా ఆ కేసుపై మరింత దర్యాప్తు జరిపి శిక్షిస్తామన్నారు.

మల్లీశ్వరి మాటలకు అజయ్ నోట మాట రాలేదు.. పైగా మల్లీశ్వరి ఎంతో కాన్ఫిడెన్స్ తో 2029లో తమ ప్రభుత్వం వస్తుందని నమ్మడం.. అలాగే జగన్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడినందుకు ఒక్కసారిగా విరుచుకు పడడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకురాలు కదా మనకి కావాల్సింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు..

TOP