February 13, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

అజయ్ ను చట్టపరంగా శిక్షిస్తాం.. జగన్ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన మల్లీశ్వరి

ఏపీ రాజకీయాల్లో తెనాలి మహిళ గీతాంజలి మరణం వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి, సోషల్ మీడియా వార్‌కు ఆఘటన కారణయమైంది. టీడీపీ , జనసేన ట్రోలింగ్ కారణంగానే మానసిక వేదనతో గీతాంజలి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపించారు. అప్పటి వైసీపీ మంత్రులు గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ కేసులో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి అజయ్ సజ్జాను గతంలో పోలీసులు అరెస్టు చేసారు. అజయ్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయటం వల్లే గీతాంజలి మృతి చెందిందని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. అనంతరం అజయ్ బెయిల్ పై విడుదలయ్యారు.. ఇదంతా గతం..

అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చిందంటే.. వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లీశ్వరి ఇటీవల ఓ టీవీ చానల్ డిబేట్ లో మాట్లాడుతున్నారు.. అదే డిబేట్ లో టీడీపీ తరపున పాల్గొన్న అజయ్ సజ్జా సబ్జెక్ట్ మాట్లాడకుండా జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే అనే పదం ఉపయోగించారు. వెంటనే కోపం చిర్రెత్తుకురావడంతో మల్లీశ్వరి రెచ్చిపోయారు. దమ్ము ధైర్యం లాంటి పదాలు ఉపయోగించవద్దని ఇప్పటికే లక్షసార్లు చెప్పానని అయినా నువ్వు మారడం లేదన్నారు. ఇలా విసిగించే గీతాంజలి మరణానికి కారణమయ్యావని, 2029లో వైసీపీ ప్రభుత్వం రాగానే కచ్చితంగా ఇందుకు మూల్యం చెల్లించుకుంటావని, చట్టపరంగా ఆ కేసుపై మరింత దర్యాప్తు జరిపి శిక్షిస్తామన్నారు.

మల్లీశ్వరి మాటలకు అజయ్ నోట మాట రాలేదు.. పైగా మల్లీశ్వరి ఎంతో కాన్ఫిడెన్స్ తో 2029లో తమ ప్రభుత్వం వస్తుందని నమ్మడం.. అలాగే జగన్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడినందుకు ఒక్కసారిగా విరుచుకు పడడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకురాలు కదా మనకి కావాల్సింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు..

ఆ కేసులో బాగ్చి రూ.కోటి లంచం తీసుకున్నారా.?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో రోజురోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఇప్పుడు నేరుగా రాష్ట్రంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇటీవలే డిజి గా పదోన్నతి పొందిన విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఈ కేసులో బిట్ కాయిన్ రూపంలో కోటికి పైగా విలువచేసే లంచం తీసుకున్నారని ఆరోపణలు గుప్పమన్నాయి.. ఈ కేసులో మొదటి నుంచి అత్యంత దూకుడుగా వ్యవహరించిన బాగ్చి పై గతంలోనే మాజీఎంపీ హర్ష కుమార్ చేసిన ఆరోపణలు ఇప్పుడు మరొకసారి తెరపైకి వచ్చాయి.. ఈ కేసులో కమిషనర్ డబ్బులు తీసుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పిన మాటలు నిజం చేస్తూ ఇప్పుడు తెరపైకి కొన్ని ఆడియోలు వచ్చాయి. ఈ ఆడియోలలో అజీమ్ ఖాన్ అనే నిందితుడు నేరుగా పోలీస్ కమిషనర్ కు బిట్ కాయిన్ రూపంలో కోటిన్నరకు పైగా లంచం ఇచ్చి అతనికి కోపం ఉన్న వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టాలని పోలీస్ కమిషనర్ పై ఒత్తిడి తీసుకురావడంతో అదేవిధంగా ఇప్పుడు అతను అక్రమ కేసులు బనాయిస్తున్నాడని ఈ కేసులో నిందితుడిగా ఉన్న రతన్ రాజ్ మీడియా ముందుకు వచ్చి ఆడియోలను విడుదల చేశారు. ఈ ఆడియోలలో ఎంత నిజం ఉందో లేదో దర్యాప్తు చేయాలని అంతేకాకుండా రతన్ రాజ్ ఈ కేసులో తమకు ఎటువంటి ప్రమేయం లేదని తనపై రోజురోజుకి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఈ కేసును సిబిఐ లేదా సిఐడి విచారించి నిజ నిజాలను తేల్చాలని తెలిపారు.

పుట్టుకతో అనేక ఆస్తులు ఉన్న తనను హనీ ట్రాప్ చేసి డబ్బులు సంపాదించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయని రతన్ రాజ్ మీడియా వేదికగా అధికారులను ప్రశ్నించాడు.. తనకు న్యాయం జరగాలని తనపై జరుగుతున్న ఈ కుట్రకు కారకులెవరు తెలియాలని చెప్పారు.. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయిన జాయ్ జెమిమా తో పాటు నిందితులందరూ బెయిల్ పై బయట ఉండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా రతన్ రాజు పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన జాయ్ బయట ఉండగా ఏ 6 గా ఉన్న రతన్ రాజ్ పై పోలీసులు కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ అనేక ఆరోపణలు కూడా బయటకు వినిపిస్తున్నాయి. అసలు విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఏం జరుగుతుందంటూ అనేక అనుమానాలకు తావతీస్తున్న పరిస్థితులు ఇప్పుడు వినిపిస్తున్నాయి. నేరుగా అజీంఖాననే నిందితుడు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు కాకపోవడం అతను అరెస్టు కాకుండా ఉంటూ మరికొంతమంది నేనే అరెస్టులు చేయిస్తున్నానని వాటికి గాను పోలీస్ కమిషనర్ కి బిట్ కాయిన్ రూపంలో లంచం అందజేశానని చెప్పడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావుతీస్తుంది. అయితే ఈ విషయంపై పోలీస్ కమిషనర్ స్పందించాల్సి ఉంది. అసలు ప్రపంచంలో ఏ కేసులు లేనట్టుగా పోలీస్ కమిషనర్ ఈ కేసులో ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తూ అరెస్టులకు తెగబడ్డారని నిందితులు ప్రశ్నిస్తున్నారు.

అనూషంగా ఈ కేసులో జాయ్ ఇంట్లో పని చేసే కొంత మందిని సైతం రిమాండ్ చేశారు. ఈ రిమాండ్ చేసిన నిందితులలో తన్వీర్ జోయ తన మూడు నెలల చిన్నారితో సహా జైలులో 13 నెలలపాటు రిమాండ్ లో ఉండవలసి వచ్చింది. ఇప్పటికీ ఈ కేసులో 15 నెలల గడుస్తున్నా చార్జి సీటు వేయకపోవడం అంతేకాకుండా అరెస్టులు సంఖ్య పెరగడం కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతోని అత్యంత కీలకమైన కిడ్నాప్, హత్యాయత్నం వంటి సెక్షన్లో పెట్టి రిమాండ్ చేయడం పట్ల అనేక అనుమానాలకు తావుతీస్తుంది. ఈ కేసులో మొట్టమొదటిగా పోలీసులు రతన్ రాజుని ప్రధాన నిందితురాలుపై ఫిర్యాదు ఇవ్వమని కోరారు.. కానీ రతన్ ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో అతనిని నిందితుడిగా కోరుకుంటూ రిమాండ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పటికైనా తనకు న్యాయం జరపాలి అంటూ చెబుతున్నాడు

వరకట్న వేధింపులు.. కాపురానికి వెళ్లిన మహిళపై భర్త కుటుంబసభ్యుల దాడి!

కృష్ణా జిల్లా, నందివాడ మండలం, తరిమిస గ్రామంలో ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన విజయలక్ష్మిపై ఆమె భర్త రఘునాథ్, అతని తల్లి శ్రీవల్లి తీవ్రంగా దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరుకు చెందిన విజయలక్ష్మిని తరిమిస గ్రామానికి చెందిన రఘునాథ్ వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తూ, అనేకసార్లు తనపై దాడులు చేశారని విజయలక్ష్మి ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పలుమార్లు సంధి జరిగినప్పటికీ, భర్త రఘునాథ్, అతని తల్లి శ్రీవల్లి వేధింపులు కొనసాగించారని తెలిపింద
ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా విజయలక్ష్మి తన తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటోంది. ఈ క్రమంలో రేపల్లెలో నివసిస్తున్న రఘునాథ్ అన్నయ్య ఫోన్ చేసి, “ఇకపై వేధింపులు ఉండవు, జాగ్రత్తగా చూసుకుంటాం” అంటూ కాపురానికి రావాలని కోరడంతో, నిన్న తన భర్త ఇంటికి వెళ్లినట్లు తెలిపింది.

అయితే అక్కడికి వెళ్లిన వెంటనే “నిన్నెవరు రమ్మన్నారు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు డబ్బులు కావాలి” అంటూ భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి తీవ్రంగా దూషించి, కర్రలతో విజయలక్ష్మిపై, ఆమె తండ్రి గోవింద రాజాచార్యులపై దాడి చేశారని ఆరోపించింది. అంతేకాకుండా తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొంది.

దాడిలో తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు మెడికల్ లీగల్ కేసు (MLC)గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తనపై, తన తండ్రిపై దాడి చేసిన భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి పై కఠిన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి డిమాండ్ చేస్తోంది.

డ్వాక్రా మహిళలతో విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమం..

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో కలిసి విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, సైబర్ భద్రత, ఆన్‌లైన్ మోసాలు, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలపై నేరాలు, అనధికార చిట్టీలు, మాదకద్రవ్యాలు వలన అనర్ధాలు మరియు వాటికి సంబంధించిన చట్టపరమైన రక్షణలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు.

ప్రజలకు చట్టాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం, మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. మహిళలపై జరుగుతున్న నేరాలపై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని, ఎలాంటి సమస్య ఎదురైన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు, అత్యవసర హెల్ప్‌లైన్లు, చట్టపరమైన హక్కులపై వివరించారు.

సైబర్ నేరాల విషయంలో ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, OTP మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా లింకులకు స్పందించవద్దని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు తెలియజేశారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్‌తో పాటు కుటుంబాలు నష్టపోతుందని పోలీసులు హెచ్చరించారు. మత్తు పదార్థాల బారిన పడితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం, నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు.
మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు చట్టరీత్యా నేరమని, కఠిన శిక్షలు ఉన్నాయని వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

రోడ్డు భద్రత అంశంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమం అనంతరం నిర్వహించిన ర్యాలీలో డ్వాక్రా మహిళలు చురుకుగా పాల్గొని, నేరరహిత సమాజం, మహిళల భద్రత, రోడ్డు భద్రత నియమాలు, సైబర్ భద్రతపై నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ప్రజలతో కలిసి పనిచేసినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమని, మహిళల భద్రత, ప్రజాభద్రతే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీస్ శాఖలు స్పష్టం చేశాయి.

రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటి

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీమంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి న్శాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. సోమవారం తెల్లవారుజామున ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది

TOP