April 15, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

కొల్లోజు దిలీప్.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఇప్పుడొక సవాలు..

కొల్లోజు దిలీప్.. యువకుడు..నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు.. విద్యార్థుల సమస్యల కోసం పోరాడినవాడు.. ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు..

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 4 వ వార్డ్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొల్లోజు దిలీప్ ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బరిలోకి దించారు..ఇంకా బీ ఫాం ఇవ్వనప్పటికీ 4 వ వార్డ్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొల్లోజు దిలీప్ పోటీలో ఉన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది… దిలీప్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో విద్యా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు…దీంతో మున్సిపల్ బరిలో దిలీప్ ఉన్నాడంటూ ప్రచారం మొదలు కావడం తో ప్రత్యర్థుల గుండెల్లో దడ మొదలైంది…

ఎన్నికల బరిలో దిలీప్ ఉంటే తమకు ఓటమీ ఖరారు అని తెలుసుకున్న ప్రత్యర్థులు ఇప్పటినుండే దిలీప్ ను ఎన్నికల బరి నుండి తొలగించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ఓ వైపు ప్రజల మద్దతు మాత్రం అనూహ్యంగా దిలీప్ వైపే ఉండటం చూసి ప్రత్యర్ధులు కంగారు పడుతున్నారు..ఎక్కడ దిలీప్ కు లభించే మద్దతు తమ ఓటమికి కారణమవుతుందోనని బయపడుతున్నారు…

మరో పక్క కొల్లోజు దిలీప్ మాత్రం తనకు పార్టీ టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు.. కష్ట పడే మనస్తత్వము ఉన్నవాన్ని,ప్రజా సమస్యల పై పోరాటం చేసే వాడిని కనుక గండ్ర వెంకట రమణా రెడ్డి తనకే టికెట్ కేటాయిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..4 వ వార్డు నుండి తాను లోకల్ అభ్యర్ధి అని, మిగతా వారు నాన్ లోకల్ కాబట్టి ప్రజల మద్దతు తనకే ఉంటుందని ఆయన నమ్ముతున్నారు…గతం లో గెలిచిన అభ్యర్థులు ఓట్ల అప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు..
తనకు బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే 4 వ వార్డ్ లో విజయ పతాకం ఎగురవేసి గండ్ర వెంకట రమణా రెడ్డి కి, బీఆర్ఎస్ పార్టీ కి 4 వ వార్డు ను గిఫ్ట్ గా అందిస్తానని దిలీప్ చెబుతున్నారు.

కూటమి నేతలు కామంతో రెచ్చిపోతున్నారు – హరీష్

అధికారన్ని అడ్డం పెట్టుకుని జనసేన, టీడీపీ నేతలు కామంతో రెచ్చిపోతున్నారని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ యువ నాయకులు గొంతే హరీష్ ఆరోపించారు. జనసేన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని వాడుకొని వదిలేసాడని, తనకి పెళ్లై కొడుకు కూడా ఉన్నాడని తెలిసినా కానీ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కారులో దూరంగా తీసుకెళ్లి రేప్ చేశాడంటూ బాధిత మహిళ చెప్తోందన్నారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, గతంలో సాక్ష్యాత్తూ మంత్రి వాసంశెట్టి సుభాస్ అశ్లీల నృత్యాల్లో పాల్గొనడం ఎంతవరకూ కరెక్ట్ అని హరీష్ ప్రశ్నించారు. కూటమిప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం చేయలేదని, కేవలం అరాచకాలు, అకృత్యాలు మాత్రమే చేస్తోందన్నారు. వచ్చే జగన్ 2.0 పాలనలో మహిళల రక్షణకు దిశ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి అభివృద్ధి చేసే పార్టీ వైసీపీ మాత్రమేనన్నారు హరీష్..

TOP